ఆంద్రప్రదేశ్ నిరుద్యోగ యువత కోసం ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ జాబ్ మేళాల వల్ల ఇప్పటికే కొన్ని లక్షల మంది ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లాలోని పుంగనూరులోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరో జాబ్మేళా జరుగనుంది. ఆగస్టు 6వ తేదీన జరుగనున్న ఈ జాబ్ మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. సంస్థల్లో గల వివిధ విభాగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నాయి. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ జాబ్ మేళా గురించి ఏదైనా సందేహాల కోసం, సమాచారం కోసం 7780599208 నంబర్ను సంప్రదించవచ్చు.
సంస్థలు, ఖాళీల వివరాలు:
- ఏయూస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ లో 30 ఖాళీలు
- అపోలో ఫార్మసీలో 60 ఖాళీలు
- భారత ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ లిమిటెడ్ లో 50 ఖాళీలు
- వెంకట్ హెచ్ఆర్ సర్వీసెస్ లో 30 ఖాళీలు
- బీఎస్ఎస్ ఎంఎఫ్ఐ – కోటక్ గ్రూప్ లో 40 ఖాళీలు
- డిక్సన్ లో 40 ఖాళీలు
- ట్రెంట్ లిమిటెడ్ టాటా సంస్థలో 100 ఖాళీలు
- ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో 50 ఖాళీలు
- టీసీఎల్ లో 50 ఖాళీలు
- ముత్తూట్ ఫైనాన్స్ లో 20 ఖాళీలు ఉన్నాయి.