పాలిటెక్నిక్ డిప్లామా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ కౌన్సెలింగ్ను మే 14 నుండి నిర్వహించనున్నారు. దీనిపై నిర్ణయం తీసుకొనేందుకు మే 10వ తేదీ శుక్రవారం పాలిసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో ప్రవేశాల షెడ్యూల్ను ఖరారు చేశారు. మే 14 నుంచి మే 16వ తేదీ వరకు విద్యార్థులు ఆన్ లైన్లో వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.
ఆన్ లైన్లో మే 15వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు హెల్ప్ లైన్ సెంటర్లలో ఏదో ఒక రోజున నిర్ణీత టైం ఎంచుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆ సెంటర్కు వెళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది..మే 15 నుండి మే 19త తేదీ వరకు వెబ్ ఆఫ్షన్లు ఇచ్చుకోవాలి. ప్రవేశాల కౌన్సెలింగ్కు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్, విద్యార్థులకు సూచనల వివరాలను మే 14న తమ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రవేశాల కమిటీ తెలిపింది.
మరోవైపు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు హాజరయ్యే విద్యార్థులు పాలిసెట్ ర్యాంకు కార్డు, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్, ఆదాయ సర్టిఫికేట్, కుల, నివాస ధృవీకరణ పత్రం తీసుకెళ్లాలి.
– 14-5-2019 నుంచి 16-05-2019
ఆన్ లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు
– 15-05-2019 నుంచి 18-05-2019
స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్
– 15-05-2019 నుంచి 19-05-2019
వెబ్ ఆప్షన్లకు అవకాశం
– 22-05-2019 సీట్ల కేటాయింపు
23-05-2019 నుంచి 25-05-2019
ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్
– 01-06-2019 నుంచి : కాలేజీల్లో రిపోర్టింగ్, తరగతులు ప్రారంభం