AP Police : ఏపిలో పోలీసు ఎస్ఐ ఉద్యోగాలకు రేపే రాతపరీక్ష ! ఏర్పాట్లు పూర్తి

పరీక్షా కేంద్రానికి ముందేగా నిర్ధేశించిన సమయానికి అభ్యర్ధులు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల లోపు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.

Written test

AP Police : ఆంధ్రప్రదేశ్ లో పోలీసు ఎస్ఐ ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

ఈ ప్రాథమిక రాత పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 291 కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది.

పరీక్షా కేంద్రానికి ముందేగా నిర్ధేశించిన సమయానికి అభ్యర్ధులు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల లోపు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించరు.

అలాగే మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, పర్సు, నోట్సు, ఛార్టులు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.

సివిల్,ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో సివిల్,ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులున్నాయి. మొత్తం 411 ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఇప్పటివరకు 1,71,936 మంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఎస్ ఐ ఉద్యోగాలకు ఒక్కో పోస్టుకు సగటున 418 మంది పోటీ పడుతున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని రావాలని స్పష్టం చేశారు.