Ayodhya Ram Mandir : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. ప్రత్యక్ష ప్రసారం..
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అభిజిత్ లగ్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1గంటకు ముగియనుంది. దేశవ్యాప్తంగానేకాక, ప్రపంచ వ్యాప్తంగా హిందువులు రామ మందిర నిర్మాణ ప్రాతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షిస్తూ జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు.. అయోధ్య మొత్తం ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది.. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి..
- Harishth Thanniru
- Published On : January 22, 2024 / 11:56 AM IST
