వాతావరణం : రాష్ట్రంలో పెరుగుతున్న చలి

  • Publish Date - December 7, 2019 / 04:22 AM IST

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా చలి పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మాల్దీవులు దానిని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో 3.6 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దీని ప్రభావం వల్ల 24 గంటలలో ఈప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో ఈశాన్య, తూర్పు దిశల నుంచి చలిగాలులు వీస్తున్నాయని, రాగల మూడురోజులు పొడివాతావరణం ఉంటుందని వారు వివరించారు.

ట్రెండింగ్ వార్తలు