DMK Minister Senthil Balaji : తమిళనాడు గవర్నర్ అర్ధరాత్రి సంచలన నిర్ణయం..మంత్రి డిస్మిస్ ఉత్తర్వు వెనక్కి
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జైలులో ఉన్న మంత్రి సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేయాలన్న వివాదాస్పద ఉత్తర్వును గవర్నర్ అర్దరాత్రి నాటకీయ పరిణామాల మధ్య వెనక్కి తీసుకున్నారు....
- saleem sk
- Published On : June 30, 2023 / 08:21 AM IST
TN Governor Takes Back Dismissal
DMK Minister Senthil Balaji : తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జైలులో ఉన్న మంత్రి సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేయాలన్న వివాదాస్పద ఉత్తర్వును గవర్నర్ అర్దరాత్రి నాటకీయ పరిణామాల మధ్య వెనక్కి తీసుకున్నారు. (TN Governor Takes Back Dismissal) మనీలాండరింగ్ కేసులో నిందితుడైన డీఎంకే మంత్రి వీ సెంథిల్ బాలాజీని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం మంత్రి మండలి నుంచి తక్షణమే తొలగించారు. అనంతరం ఆ ఉత్తర్వును గవర్నర్ ఉపసంహరించుకున్నారు. తదుపరి సంప్రదింపుల వరకు తొలగింపు ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపి ఉంచాలని గవర్నర్ అర్థరాత్రి నిర్ణయించారు.
Extreme Temperatures : మెక్సికోలో మండుతున్న ఎండలతో 112 మంది మృతి
ఈ విషయం గురించి ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్కు కూడా తెలియజేసినట్లు రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఇప్పుడు అటార్నీ జనరల్ను సంప్రదిస్తారని, బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగా కొనసాగుతారని కూడా రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. మనీలాండరింగ్ కేసులో నిందితుడైన వి సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుంచి గవర్నర్ వెంటనే తొలగించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఉద్యోగాల కోసం నగదు తీసుకోవడం, మనీలాండరింగ్ వంటి పలు అవినీతి కేసుల్లో మంత్రి వి సెంథిల్ బాలాజీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఆయనను మంత్రి మండలి నుంచి తక్షణమే తొలగించారని గురువారం రాజ్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
Mumbai Local Train : ముంబయి లోకల్ రైలులో మహిళపై లైంగిక వేధింపులు
ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పోర్ట్ఫోలియో లేకుండానే సెంథిల్ ను మంత్రిగా కొనసాగించారు. ఈ నిర్ణయాన్ని గవర్నర్ రవి ఏకపక్షంగా భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా మంత్రి సెంథిల్ బాలాజీని తొలగించే హక్కు లేదని, దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని గురువారం సీఎం స్టాలిన్ చెప్పారు. రాష్ట్ర మంత్రి మండలి నుంచి బాలాజీని తొలగించే ఉత్తర్వు, అది రూపొందించిన కాగితానికి కూడా విలువ లేదని డిఎంకె నాయకుడు ఎ శరవణన్ అన్నారు.
Delhi University: మోదీ పర్యటన సందర్భంగా విద్యార్థులు నల్లరంగు దుస్తులు ధరించవద్దు
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ కూడా జైలులో ఉన్న మంత్రిని తొలగించడాన్ని నిందించారు. సీఎం సలహా మేరకే మంత్రులను నియమిస్తారు కాబట్టి సీఎం సలహా మేరకే వారిని తొలగించవచ్చునని మనీష్ తివారీ పేర్కొన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం పలు అంశాలపై గవర్నర్ కార్యాలయంతో విభేదిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టానికి గవర్నర్ ఆమోదం నిరాకరించడం, గవర్నర్ రవి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ డిఎంకె గత ఏడాది అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకి ఫిర్యాదు చేసింది.
