Fishing Boat Accident : కేరళలో ఫిషింగ్ బోట్ ప్రమాదం, ఒకరి మృతి, ముగ్గురు గల్లంతు

కేరళ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరంలో సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడిన దుర్ఘటనలో ఓ మత్స్యకారుడు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన తిరువనంతపురం జిల్లాలోని ముతలపోజిలో చోటుచేసుకుంది....

Fishing Boat Accident

Fishing Boat Accident : కేరళ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరంలో సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడిన దుర్ఘటనలో ఓ మత్స్యకారుడు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన తిరువనంతపురం జిల్లాలోని ముతలపోజిలో చోటుచేసుకుంది. (3 Missing In Fishing Boat Accident) కుంజుమోన్ (42) మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, మరో ముగ్గురు-రాబిన్ (42), బిజు (48), బిజు (55) అదృశ్యమయ్యారని అంజుతెంగు పోలీసులు తెలిపారు.

Heavy Rain Alert : ఇళ్లలోనే ఉండండి..ప్రజలకు హిమాచల్ సీఎం హెచ్చరిక

సోమవారం ఉదయం సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పడవ బోల్తా పడింది. మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్‌లో ఉన్నారు. తప్పిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని తీరప్రాంత పోలీసు అధికారులు చెప్పారు.

Heavy Rains : ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. వరదల్లో కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు

పెరుమతుర వద్ద ఉన్న ముతలపోజి వామనపురం నది, కడినంకులం సరస్సు అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం వద్ద ఈ బోటు ప్రమాదం జరిగింది. భారీవర్షాలతో అతలాకుతలమైన కేరళలో పడవ ప్రమాదం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు