పాకిస్తాన్ బాలాకోట్పై AIF దాడి అనంతరం F16 విమానాలను వినియోగించలేదని బుకాయించిన పాకిస్తాన్ ఇప్పుడు మాట మార్చింది. పాక్ F16 యుద్ధ విమానాలే.. భారత్ విమానాలను కూల్చేశాయని పాక్ అంగీకరించింది. పాక్ సైన్య అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ప్రకటించటం కలకలం రేపుతోంది.
2019 ఫిబ్రవరి 27న నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ వైమానిక దళం(PAF) పాక్ గగనతలం నుంచే దాడులకు దిగింది. ఆ సమయంలో మా భూభాగంలోకి ప్రవేశించిన రెండు IAF విమానాలను పాకిస్తాన్ కూల్చివేసింది. మేం వినియోగించిన విమానాల్లో F16 కూడా ఉన్నాయి అని ప్రకటించింది. ఆత్మరక్షణ కోసం ఏ విధంగానైనా స్పందించే హక్కు మాకుంది అని సగర్వంగా ప్రకటించింది పాక్. ఆ ఘటన గత చరిత్ర.. మా దగ్గర ఉన్న F16 విమానాలను మాత్రం IAF కూల్చలేదు అని ఆయన స్పష్టం చేశారు.
ఫిబ్రవరిలో జేఎఫ్–17 రకం విమానాన్ని మాత్రమే వాడినట్లు గఫూర్ ప్రకటించారు. బాలాకోట్లోని ఉగ్ర శిబిరాలపై ఇండియా వైమానిక దాడికి ప్రతీకారంగా.. పాక్ వైమానిక దళం కూడా దాడికి యత్నించిన విషయం తెలిసిందే. అమెరికా తయారీ ఎఫ్–16ను ఐఏఎఫ్ కూల్చివేయడం కలకలం రేపింది. ఈ విమానాలను మూడో దేశంపై ఉపయోగించరాదని విక్రయ ఒప్పందంలో అమెరికా సూచించింది. ఈ షరతులను పాక్ ఉల్లంఘించిందంటూ భారత్ అమెరికాకు సాక్ష్యాధారాలు అందజేసింది.