చిత్తూరు జిల్లాలో మూడు రోజుల్లో 38 కేసులు నమోదు అయ్యాయి. 34 కేసులకు కోయంబేడు మార్కెట్ తో లింక్ ఉంది. శనివారం 11, ఆదివారం 16 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఇవాళ మరో 9 మందికి వైరస్ సోకిం. మొత్తం కేసుల సంఖ్య 121 కి చేరింది.
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. రాష్ట్రంలో కొత్తగా 38మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2018కి చేరింది. కరోనా కేసులు గురించి సోమవారం(మే 11,2020) వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి 998మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45మంది మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 975. కరోనాతో 45మంది చనిపోయారు.
కర్నూలు – 575, గుంటూరు – 387, కృష్ణా – 342, చిత్తూరు – 121, అనంతపురం – 115.
నెల్లూరు – 102, కడప – 97, ప.గో – 68, విశాఖ – 66, ప్రకాశం – 63, తూ.గో – 46, శ్రీకాకుళం – 5, విజయనగరం – 4, ఇతర రాష్ట్రాలకు చెందిన 27మందికి కరోనా సోకింది.
Read More:
* ఏపీలో 2వేలు దాటిన కరోనా కేసులు, కొత్తగా 38 మందికి కొవిడ్
* ఏపీలో కొవిడ్ సూపర్ స్ప్రెడర్స్.. ఆ 40 మంది 300 మందికి కరోనా అంటించారు