GHMC మేయర్‌ డ్రైవర్‌కు కరోనా..!

  • Publish Date - June 11, 2020 / 03:14 PM IST

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవర్‌ కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో అతడికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈరోజు ఉదయం నుంచి మేయర్‌తో కారు డ్రైవర్ విధుల్లోకి వచ్చాడు. అతడికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

వెంటనే అతడు ఎవరెవరిని కలిశాడో అందరిని ఆరా తీస్తున్నారు. తన డ్రైవర్‌కు కరోనా అని తెలిసిన మేయర్‌‌, ఆయన  కుటుంబం హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. మేయర్‌ రామ్మోహన్, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం.  

ఇటీవలే రోజుల క్రితమే బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌ అని తేలింది. స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్‌లో మేయర్‌ టీ కూడా తాగినట్టు తెలిసింది. అంతకుముందే టీ షాపులో పనిచేసే మాస్టర్‌కు కరోనా సోకినట్లు తేలింది. అధికారులు వైద్యులకు సమాచారం ఇవ్వడంతో ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగటివ్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.