ఏపీలో కొత్తగా 52 కరోనా కేసులు

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో

  • Publish Date - May 18, 2020 / 05:56 AM IST

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం(మే 18,2020) కరోనా కేసులపై బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన వాటితో కలిసి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 2వేల 282కి చేరింది. ఇప్పటివరకు 1,527 మంది కోలుకున్నారు. 705 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 50మంది చనిపోయారు.

జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలు:
చిత్తూరు 15
కృష్ణా 15
నెల్లూరు 7
తూ.గో 5
కర్నూలు 4
కడప 2
ప.గో. 2
విజయనగరం 1
విశాఖ 1

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు:

Read Here>> ఏపీలో 24 గంటల్లో 48 కరోనా కేసులు