రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘22’ టీజర్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది..
రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్..‘22’.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వంలో, మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా విడుదలైన హీరో ఫస్ట్లుక్ గ్లింప్స్కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథిగా పాల్గొని ‘22’ మూవీ క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కొండా కృష్ణం రాజు పాల్గొన్నారు.
Read Also : షకీలా సినిమా అంటేనే సెన్సార్ ఇవ్వడంలేదు – షకీలా ఆవేదన
కింగ్ నాగార్జున మాట్లాడుతూ : “అందరికి ఎంతో ఇష్టమైన బి.ఎ.రాజు గారి, జయగారి అబ్బాయి శివ. జయగారు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి చాలా ఇష్టం. వాళ్ళిద్దరితో నేను బాగా క్లోజ్గా ఉంటాను. జయగారు ఇప్పుడు మన మధ్య లేరు కానీ వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అవుతున్నాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆమె అందరికి బాగా తెలిసిన మహిళా దర్శకురాలు. శివ దర్శకుడిగా జయగారి పేరు నిలబెట్టాలి. అలాగే బి.ఎ.రాజు గారిది కూడా. రూపేష్ వెల్ కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ. బయట ఎన్నో సక్సెస్ ఫుల్ బిజినెస్లు ఉన్నా సినిమా అంటే ఫ్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చాడు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఇప్పుడే టీజర్ చూశాను. ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ 22. టీజర్ విడుదలయింది 2-2-2020. అన్ని రెండులే ఉన్నాయి. న్యూమరాలజి ప్రకారం నాది కూడా రెండు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్” అన్నారు.
చిత్ర దర్శకుడు శివకుమార్ బి. మాట్లాడుతూ : “నాగార్జున టీజర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. కొత్త దర్శకులను ప్రొత్సహించే నాగార్జున గారి చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంటైర్ 22 టీమ్ తరపున నాగార్జున గారికి థ్యాంక్స్. మారుతిగారు ఇటీవల ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఆ పండగను ఈ పండగకి తీసుకువచ్చారు. మా 22లో ఆ పండగ జరుగుతుంది. ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు అందరికీ థ్యాంక్స్.
కొండా కృష్ణంరాజు గారికి, మారుతి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆడియో విషయంలో ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, నిరంజన్ గారు చాలా సపోర్ట్ చేశారు. కమర్షియల్గా కూడా ప్రొత్సహిస్తున్నారు. ఇప్పుడు ఈ టీజర్ లాంచ్కి కూడా వారి సహకారం అందించారు. కథ ప్రకారమే 22 అనే టైటిల్ పెట్టాం. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.
విక్రమ్ జీత్ విర్క్, దేవిప్రసాద్, జయప్రకాష్, రవి వర్మ, శశిధర్ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీ నాయర్, పూజా రామచంద్రన్, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్ తరుణ్, మాస్టర్ దేవాన్ష్, బేబి ఓజల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్, సంగీతం : సాయికార్తీక్, ఎడిటింగ్ : శ్యామ్ వాడవల్లి, కొరియోగ్రఫీ : అనీలామా, ఆర్ట్ : పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్ : జాషువ, లిరిక్స్ : భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, చీఫ్ కో-డైరెక్టర్ : పుల్లారావు కొప్పినీడి, నిర్మాత : శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్, దర్శకత్వం : శివకుమార్ బి.