ChaySam Break-UP: అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లుగా విడివిడిగా ఒకే ప్రకటన చేశారు. అధికారికంగా మేమిద్దరం విడిపోతున్నాం.. అని ప్రకటించన తర్వాత అక్కినేని నాగార్జున ఫస్ట్ రియాక్షన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
“బరువెక్కిన గుండెలో నుంచి బాధగా ఈ విషయం చెబుతున్నా.. సమంత, చైతన్య మధ్య ఏం జరిగిందో అదంతా యాదృచ్చికమే. భార్యాభర్తల మధ్య జరిగిన విషయాలు అన్నీ వారి వ్యక్తిగతమైనవే. సమంత, చైతన్య ఇద్దరూ కూడా నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు. సమంతతో కలిసి మా కుటుంబం గడిపిన ప్రతీ క్షణమూ మాకు ప్రత్యేకమే. వారిద్దరూ విడిపోవడం దురదృష్టకరం. కానీ, వారి నిర్ణయాలను గౌరవిస్తున్నాం. వారిద్దరికీ భగవంతుడు ముందుకు సాగే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను.” అంటూ ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు నాగార్జున.
సోషల్ మీడియా అకౌంట్లో అక్కినేని పేరుని తొలగించినప్పటి నుంచే నాగచైతన్య, సమంత విడిపోతున్నారు అనే వార్త హల్ చల్ చేసింది. కాగా.. ఇప్పుడు వారిద్దరూ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2021