Pushpa : పుష్ప సినిమా మొత్తం మూడు పార్టులుగా రాబోతోందా..!

అల్లు అర్జున్ పుష్ప సినిమా మొత్తం మూడు పార్టులుగా రాబోతోందా..? పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్, పుష్ప రోర్..

Allu Arjun Rashmika Mandanna Pushpa movie will come into three parts

Pushpa : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన మూడో సినిమా పుష్ప. 2021లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఈ మూవీ రెండు పార్టులుగా రూపొందుతున్న విషయం కూడా అందరికి తెలిసిందే. ఇక మొదటి భాగం పుష్ప ది రైజ్ సూపర్ హిట్ కావడంతో పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సెకండ్ పార్టుని ఆగష్టు 15కి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా రాబోతుందట. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్, పుష్ప రోర్.. ఇలా మూడు పార్టులుగా సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారట.

Also read : Jyothika : అయిదేళ్ల తర్వాత ‘అమ్మ ఒడి’ అంటూ డబ్బింగ్ అవుతున్న జ్యోతిక సినిమా.. ఎన్నికల ముందే రిలీజ్?

మొదటి పార్టులో పుష్ప ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్.. రెండో పార్టులో ఎలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అనేది చూపించబోతున్నారు. ఇక మూడో పార్టులో తన సామ్రాజ్యం కోసం పుష్ప చేసే యుద్ధంతో మూవీని ముగించబోతున్నారని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ వార్త అయితే నెట్టింట వైరల్ గా మారింది.

కాగా ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇక సునీల్, అనుసయా, ధనంజయ నెగటివ్ పాత్రల్లో నటిస్తున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మొదటి పార్టుకి దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ వరల్డ్ వైడ్ గా రీసౌండ్ వచ్చాయి. దీంతో సెకండ్ పార్ట్ సాంగ్స్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ముఖ్యంగా ఐటెం సాంగ్ పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. మరి దేవిశ్రీ ఏ రేంజ్ సాంగ్ రెడీ చేస్తున్నారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు