Jawan 2 : బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan).. ఇటీవల జవాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి 1000 కోట్ల వైపు దూసుకెళ్తుంది. ఈ సినిమాలో షారుఖ్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో నటించాడు. అయితే ఈ పాత్రల్లో తండ్రి ‘విక్రమ్ రాథోర్’ పాత్ర మంచి స్పందన తెచ్చుకుంది. ఆడియన్స్ లో ఈ పాత్రకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఈ పాత్రతో మరికొంత కథ ఉంటే బాగుండేదని అందరూ ఫీల్ అవుతున్నారు.
తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ అట్లీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ సీక్వెల్ పై భారీ క్రేజ్ ఏర్పడింది. జవాన్ 2 ఉంటుందా..? లేదా..? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ విషయం పై అట్లీ మాట్లాడుతూ.. సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. పార్ట్ 2 ని విక్రమ్ రాథోర్ పాత్రతో డిజైన్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. జవాన్ రిలీజ్ అయిన తరువాత ఎక్కువమంది విక్రమ్ రాథోర్ పాత్ర గురించే మాట్లాడుకున్నారు. అందుకనే ఆ పాత్రతో పార్ట్ 2 ని ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. కాగా జవాన్ ని షారుఖ్ తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ లో ఎక్కడా రాజీపడకుండా నిర్మించాడు. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించినట్లు సమాచారం. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి విలన్ గా కనిపించాడు. దీపికా పదుకొనె అతిథి పాత్రలో నటించింది.