ఈ నెల 26న దేశంలో మొత్తం 2,500 స్క్రీన్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఓ హాలీవుడ్ సినిమా ఇన్ని స్క్రీన్ల పై విడుదల కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ చిత్రం ఇక్కడ ఇంత భారీగా విడుదల కాలేదు.
హాలీవుడ్ చిత్రం మార్వెల్ లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘అవెంజర్స్ ఎండ్గేమ్’ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 26న దేశంలో మొత్తం 2,500 స్క్రీన్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఓ హాలీవుడ్ సినిమా ఇన్ని స్క్రీన్ల పై విడుదల కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ చిత్రం ఇక్కడ ఇంత భారీగా విడుదల కాలేదు.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామా అని అవెంజర్స్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘అవెంజర్స్’కు తమిళ్ రాకర్స్ షాక్ ఇచ్చారు. విడుదలకు రెండు రోజుల ముందే మొత్తం సినిమాను ఆన్లైన్ లో లీక్ చేసేశారు. ‘అవెంజర్స్ ఎండ్గేమ్’ ఈనెల 24న జర్మనీ, సింగపూర్తో పాటు ఇతర దేశాల్లో విడుదల చేశారు. ఇండియాలో మాత్రం ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. దీంతో ఇక్కడ విడుదల కావడానికి రెండు రోజుల ముందే మొత్తం సినిమాను తమిళ్రాకర్స్ ఆన్లైన్లో పెట్టేశారు.
విపరీతమైన క్రేజ్ ఉన్న ఇలాంటి సినిమా ఆన్లైన్లో లీకైతే ఆ ప్రభావం బాక్సాఫీసుపై పడుతుందని భయపడుతున్నారు నిర్మాతలు. అయితే, విశ్లేషకులు మాత్రం దీని వల్ల నష్టం ఏమీలేదని, ఇలాంటి సినిమాను థియేటర్లో చూస్తేనే ఎంజాయ్ చేస్తామని, మార్వల్స్ అభిమానులెవరూ ఈ సినిమాను పైరసీ కాపీ రూపంలో చూడాలనుకోరని అభిప్రాయపడుతున్నారు.