ప్రస్తుత లాక్డౌన్ సమయంలో సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లో ఉంటున్నారు. రోజువారీ పనులతో సహా రకరకాల వీడియోల ద్వారా వారిని అలరిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో మేల్ సెలబ్రిటీలందరూ ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ ఛాలెంజ్లో పాల్గొన్న ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు మాత్రం అందరిలా క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోకుండా తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. తన కంశాలి వృత్తిని గుర్తుచేసుకున్నారు. అలాగే ఇంట్లో మిగిలి పోయిన గజ్జెలతో తన భార్య, పిల్లల కోసం.. మెట్టెలు, గజ్జెలు స్వయంగా ఆయన చేతులతో తయారు చేశారు. తనదైన శైలిలో ‘బీ ద రియల్ మ్యాన్’ చాలెంజ్ను పూర్తి చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను సంపూర్ణేష్ బాబు ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘రాజు పేద తేడా లేదు. నీ ఆస్తి, డబ్బు.. నీ వెనక రావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు, గుర్తుచేసుకుంటున్న సమయం ఇది. మా ఆవిడ కోసం, పిల్లల కోసం నా పాత “కంశాలి”వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను’ అని సంపూ పేర్కొన్నారు. అలాగే లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ సంపూ రూ. లక్ష రూపాయలు విరాళం అందించిన సంగతి తెలిసిందే
రాజు పేద తేడా లేదు…
నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు..
నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూమా ఆవిడ కోసం, నా పాత “కంశాలి”వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను#BetheREALMAN pic.twitter.com/TDrHZtnXIL
— Sampoornesh Babu (@sampoornesh) April 23, 2020