Sharathulu Varthisthai : చైతన్య రావు(Chaitanya Rao), భూమి శెట్టి జంటగా తెరకెక్కిన సినిమా ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి దర్శకత్వంలో స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రాగా సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా షరతులు వర్తిస్తాయి సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ దేశంలో ఉన్న ఎనభై శాతం సామాన్యుల కథనే ఈ సినిమా అంటూ ప్రమోట్ చేస్తున్నారు. సినిమా అంతా కరీంనగర్, చుట్టుపక్క ప్రాంతాల్లోనే తీసినట్టు తెలుస్తుంది. హీరో హీరోయిన్స్ పేర్లు చిరంజీవి, విజయశాంతి అని పెట్టడం విశేషం. ట్రైలర్ చూస్తుంటే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, అందులో ప్రేమలు, ఎమోషన్స్, వ్యాపారం పేరుతో మిడిల్ క్లాస్ వాళ్ళని మోసం చేయడం.. వంటి అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. అందుకే దేశంలోని మిడిల్ క్లాస్ వాళ్ళ సినిమా అంటూ ప్రమోట్ చేస్తున్నారు.
షరతులు వర్తిస్తాయి ట్రైలర్ మీరు కూడా చూసేయండి..