Mega Combo: మెగా కాంబో మళ్ళీ సెట్.. భారీ మైథలాజికల్ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
మెగాస్టార్(Mega Combo) చిరంజీవి, అశ్విని దత్ కాంబోలో మరో సినిమా రాబోతోంది.
- V Santhosh Kumar
- Published On : February 21, 2026 / 02:12 PM IST
Chiranjeevi and Ashwini Dutt teaming up for another film.
Mega Combo: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిన మెగాస్టార్ త్వరలో విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భారీ గ్రాఫికల్ మూవీ గా వస్తున్న విశ్వంభర సినిమాను దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత వాల్తేరు వీరయ్య మూవీ దర్శకుడు బాబీ కొల్లితో ఒక సినిమా, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమాను లైన్ లో పెట్టాడు మెగాస్టార్.
అయితే, రీసెంట్ గా మరో భారీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చిరు. అందుకోసం మెగా ప్రొడ్యూసర్ అశ్విని దత్(Mega Combo) తో చాలా కాలం తరువాత జత కట్టనున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవ లాంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చాలా కాలం తరువాత ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
Nabha Natesh: నాభా నటేష్ గ్లామర్ పీక్స్ అబ్బా.. హాట్ ఫొటోలు వైరల్
ఇక ఈ సినిమాకు అశ్విని దత్ అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి 2 సినిమాను చేసే పనిలో ఉన్నాడు. దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ అయ్యింది. అయితే, ఇటీవల నాగ్ అశ్విన్ నిర్మాత అశ్విని దత్ కి ఒక కథను వినిపించాడట. అది నచ్చడంతో మెగాస్టార్ కి అయితే బాగుంటుంది అని సజెస్ట్ చేశాడట.
ఆ కథను చిరుకి వినిపించగా ఆయన కూడా ఒకే చేశాడట. కల్కి సినిమాలాగే ఈ కథ కూడా మైథాలజీ సబ్జెక్టుతో రానుందట. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. నిజానికి నాగ్ అశ్విన్ మహానటి సినిమా తరువాతనే మెగాస్టార్ తో ఈ సినిమా చేయాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా ప్రభాస్ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు నాగ్ అశ్విన్. ప్రభాస్ కల్కి 2 పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉంది.
