లాక్‌డౌన్ వేళ వంటింట్లో బాలయ్య అక్కా, బావల బిర్యానీ తయారీ..

లాక్‌డౌన్ వేళ వంటింట్లో దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వర రావు సందడి చేశారు..

  • Publish Date - April 13, 2020 / 10:58 AM IST

లాక్‌డౌన్ వేళ వంటింట్లో దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వర రావు సందడి చేశారు..

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైతేనో నిత్యావసరాలకోసమో తప్ప ఎవరూ బయటకి రావడంలేదు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్లు ఇస్తున్నారు.

సేఫ్ హ్యాండ్స్‌తో సహా పలు చాలెంజెస్ స్వీకరిస్తూ.. తోటివారికి కూడా చాలెంజ్ విసురుతున్నారు. తాజాగా నటసింహ నందమూరి బాలకృష్ణ సోదరి, బావ కలిసి వంట చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరి కలిసి వంటగదిలో పోటీ పడి మరీ రకరకాల నాన్ వెజ్ వెరైటీలు వండారు.

ఈ వీడియోకు ‘ఉలవచారు బిర్యానీ’లోని ‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా’ పాటను బ్యాగ్రౌండ్‌లో వాడారు. బిర్యానీ, నాటుకోడి పులుసు వండిన తర్వాత పురంధేశ్వరి, వెంకటేశ్వర రావు కలిసి కాసేపు మనవరాలిని ఆడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also :ఈ జ‌న్మ‌కిది చాలు: మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌పై రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పంద‌న‌!

ట్రెండింగ్ వార్తలు