Mahi V Raghav Sensational Comments on Film Industry Related to Madanapalle Studio Place Issue
Mahi V Raghav : దర్శకుడు మహి వి.రాఘవ్ మంచి సినిమాలు, సిరీస్ లతో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. గతంలో వైఎస్సార్ బయోపిక్ గా యాత్ర సినిమాతో రాగా ఇటీవలే వైఎస్ జగన్ బయోపిక్ గా యాత్ర 2(Yatra 2) సినిమాతో వచ్చాడు. తండ్రి, కొడుకు ఎమోషనల్ డ్రామాతో యాత్ర 2 ప్రేక్షకులని మెప్పించింది.
అయితే ఈ సినిమా రిలీజ్ అనంతరం మహి వి.రాఘవ్ కి ఏపీ ప్రభుత్వం స్టూడియో కట్టడం కోసం మదనపల్లిలో(Madanapalle) స్థలం ఇచ్చారు అంటూ విమర్శలు వచ్చాయి. యాత్ర 2 సినిమా తీసినందుకే ఇలా ఇస్తున్నారు అంటూ పలువురు విమర్శలు చేశారు. తాజాగా దర్శకుడు మహి వి.రాఘవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విమర్శలకు సమాధానాలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : Pushpa 2 : శ్రీవల్లి తీసిన సుకుమార్ ఫొటోతో.. ‘పుష్ప 2’ వాయిదాపై క్లారిటీ ఇచ్చిన టీం..
మహి వి.రాఘవ్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది? నాది రాయలసీమ. నా ప్రాంత అభివృద్ధి కోసం ఒక మినీ స్టూడియో కట్టాలనుకుంటున్నాను. నా ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశ లేకపోతే నేను హైదరాబాద్లోనో, వైజాగ్లోనో స్టూడియో కట్టుకోవటానికి స్థలం కావాలని అడుగుతాను. అంతేగాని మదనపల్లిలో ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటున్నాను. నేను మదనపల్లిలోనే పుట్టి పెరిగాను, అక్కడే చదివాను. సినీ పరిశ్రమలో రాయలసీమలో షూటింగ్స్ చేయటానికి ఆసక్తి చూపించరు. నా ప్రాజెక్ట్స్ పాఠశాల, యాత్ర 2, సిద్ధాలోకం, సైతాన్ వెబ్ సిరీస్ లను రాయలసీమలోనే షూట్ చేసాను. ఈ ప్రాజెక్ట్స్కి దాదాపు 20 నుంచి 25 కోట్ల వరకు ఖర్చు చేశాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశం కోసమే అక్కడ స్టూడియో కట్టాలనుకుంటున్నా. మదనపల్లిలో సినిమాలు చేయటం వల్ల లాడ్జీలు, హోటల్స్, భోజనాలు, జూనియర్స్ ఇలా పలు రకాలుగా స్థానికులకు ఉపయోగం ఉంటుంది. అయినా నేనేమీ స్టూడియో నిర్మాణం కోసం యాబై, వంద ఎకరాలు అడగలేదు. కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాలనుకున్నాను. రాయలసీమకు ఎవరైనా ఏమైనా చేశారా? మీరు చేయరు.. చేసేవాడిని చెయ్యనియ్యరు. నేను నా ప్రాంతంలో కేవలం రెండు ఎకరాల్లో, అక్కడి ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో మినీ స్టూడియో కట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో దర్శకుడు మహి వి.రాఘవ్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో సంచలనంగా మారాయి.