Drishyam : భారతీయ తొలి చిత్రంగా.. హాలీవుడ్‌కి వెళ్తున్న దృశ్యం..

భారతీయ తొలి చిత్రంగా హాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న 'దృశ్యం' సినిమా. హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ..

Malayala Movie Drishyam is going to remade in Hollywood

Drishyam : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కి 2013లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం’. అక్కడ సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రాన్ని తమిళంలో కమల్ హాసన్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ తో పాటు కన్నడ, కొరియా, జపాన్ భాషల్లోని స్టార్స్ కూడా ఈ సినిమాని రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.

ఇలా రిలీజైన ప్రతి భాషలో హిట్టు అందుకున్న ఈ సినిమాకి.. 2021లో సీక్వెల్ ని తీసుకు వచ్చారు. ఆ సీక్వెల్ ని కూడా రీమేక్ చేసి ఆయా భాషల హీరోలు హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం మూడో పార్ట్ వస్తే.. దానిని కూడా రీమేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే, ఈ చిత్రం ఇప్పుడు హాలీవుడ్ కూడా వెళ్ళడానికి సిద్దమవుతుందట. ఓ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ఈ సినిమాని ఇంగ్లిష్‌ అండ్ స్పానిష్‌ భాషల్లో రీమేక్‌ చేయబోతున్నట్లు ప్రకటించింది.

Also read : Tantra Trailer : భయపెట్టడానికి రాబోతున్న అనన్య నాగళ్ళ.. ‘తంత్ర’ ట్రైలర్ చూశారా..?

హాలీవుడ్‌ గల్ఫ్‌ స్ట్రీమ్ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థ మరో ప్రొడక్షన్ కంపెనీతో కలిసి.. ఈ ‘దృశ్యం’ సినిమాలను హాలీవుడ్ ఆడియన్స్ కి కూడా చూపించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆల్రెడీ అంతర్జాతీయ రీమేక్‌ హక్కులను కూడా ఆ హాలీవుడ్ నిర్మాణ సంస్థ సొంతం చేసుకొని.. మూవీని సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు పనులు మొదలుపెట్టేసినట్లు సమాచారం. ఇక రీమేక్‌తో ‘దృశ్యం’ సినిమా హాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్న తొలి చిత్రంగా నిలవబోతుంది.

కాగా ఈ చిత్రాన్ని మూడో పార్టుని కూడా మలయాళ మేకర్స్ అనౌన్స్ చేశారు. 2022లో ఈ అనౌన్స్‌మెంట్ చిత్ర నిర్మాతలు తెలియజేసారు. మూడో పార్టు కూడా జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలోనే ఉంటుందని పేర్కొన్నారు. అయితే జీతూ జోసెఫ్ ఈ సినిమాని స్టార్ట్ చేయకుండా.. మోహన్ లాల్ తోనే వరుస సినిమాలను తెరకెక్కిస్తున్నారు. మరి దృశ్యం 3ని ఎప్పుడు పట్టాలు ఎక్కిస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు