Mansoor Ali Khan viral comments on Chiranjeevi about Trisha issue
Chiranjeevi : ఇటీవల తమిళ ఇండస్ట్రీలో పుట్టుకొచ్చిన త్రిష, మన్సూర్ అలీఖాన్ వివాదం పై స్పందిస్తూ చిరంజీవి ట్వీట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ ట్వీట్ పై మన్సూర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి ట్వీట్ గురించి మాట్లాడుతూ.. మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ మన్సూర్ చేసిన ఆ కామెంట్స్ ఏంటి..?
“చిరంజీవి ప్రతి ఏడాది లేడీ హీరోయిన్స్ కి పార్టీలు ఇస్తుంటారు. ఆ పార్టీలకు నన్ను ఎప్పుడు పిలువలేదు అనుకోండి. ఆయన కేవలం హీరోయిన్స్ ని మాత్రమే పిలుస్తారు. అది ఆయన ఇష్టం. కానీ నాకు సంబంధించిన ఒక విషయం జరిగినప్పుడు.. అసలు ఏం జరిగిందని ఒకసారి కాల్ చేసి విషయం తెలుసుకొని ఉంటే బాగుండేది. అలా కాకుండా ఆయన మాట్లాడిన మాటలు బాధించాయి” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే చిరంజీవి పార్టీ పెట్టి కొన్ని వేల కోట్లు సంపాదించారని, కానీ పేద వాళ్ళకి ఒక్కరికి కూడా హెల్ప్ చేయలేదని వాపోయారు. చిరంజీవి, కుష్బూ, త్రిష మీద 20 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు, వచ్చిన డబ్బును మధ్యం తాగి చనిపోయిన కుటుంబాలకు ఇస్తానంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Mahesh Babu : కృష్ణ కోప్పడిన సందర్భం.. భార్యని ఎలా మ్యానేజ్ చేయాలో చెప్పిన మహేష్..
#MansoorAliKhan Comments on #Chiranjeevi:
👉 Aayana Old Heroines tho Every Year Party Cheskuntadu.
👉 Okasari Naku Call Chesi Asal Em Jarigindhi ani Adagalsindi. pic.twitter.com/b44tLcpSmc— Movies4u Official (@Movies4u_Officl) November 28, 2023
చిరంజీవి పార్టీ పెట్టి కొన్ని వేల కోట్లు మింగాడు కానీ పేద వాళ్ళకి ఒక్కరికి కూడా హెల్ప్ చేయడు ఎవరిది వక్ర బుద్ధి.@KChiruTweets మీద 20 కోట్లకు పరువు నష్టం దావా వేసాను వచ్చిన డబ్బును మధ్యం తాగి చనిపోయిన కుటుంబాలకు ఇస్తాను – మన్సూర్ ఆలీ
pic.twitter.com/t7hD0BspRI— Gopi Nath NBK (@Balayya_Garu) November 28, 2023
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. విలన్ రోల్స్ చేసే మన్సూర్ అలీఖాన్ తన కెరీర్ లో చాలావరకు హీరోయిన్స్ ని రేప్ చేసే సీన్స్ చేశారు. ఇక ఇటీవల త్రిష హీరోయిన్ గా నటించిన ‘లియో’ సినిమాలో మన్సూర్ కి ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఆ రోల్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ లేనందుకు బాధపడ్డాను అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే వివాదం అయ్యాయి. దీంతో త్రిషతో పాటు లోకేష్ కనగరాజ్, మాళవిక మోహనన్, కుష్బూ, డైరెక్టర్ కార్టీక్ సుబ్బరాజు, చిన్మయి, నితిన్ వంటివారు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ కామెంట్స్ చేశారు.
దక్షిణ భారత నటీనటుల సంఘం మన్సూర్ కి నోటీసులు పంపించడం, జాతీయ మహిళా కమిషన్ మన్సూర్ పై కేసు నమోదు చేయడంతో.. మన్సూర్ త్రిషకు క్షమాపణలు చెబుతూ ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. అలాగే మన్సూర్ అలా మాట్లాడానికి గల కారణం కూడా వివరించారు. తనకు చాలావరకు రేప్ సన్నివేశాలు కలిగి ఉండే పాత్రలే ఎక్కువ వస్తుండడంతో.. ఇందులో కూడా అలాంటి రోల్ ఇస్తారనుకున్నట్లు, కానీ అసలు త్రిషతో తనకి సన్నివేశమే లేని పాత్ర ఇచ్చారని, అందుకు తాను ఫీల్ అయ్యానని క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను కొంతమంది నెగిటివ్ గా ప్రమోట్ చేసి ఇంత పెద్ద వివాదం సృష్టించారని చెప్పుకొచ్చారు.