అందం, అదృష్టం, కొద్దిపాటి టాలెంట్ ఉంటే భాష ఏదైనా కథానాయికగా నెట్టుకురావచ్చు. అలాంటి దక్షిణాది భామలను ఇప్పటివరకు చాలామందిని చూశాం. టాలెంట్, కష్టపడే తత్వం ఉన్నా అవకాశాలు రాని వారి పరిస్థితి మరీ దారుణం.. అలాంటి వారు ఆఫర్లు వస్తాయనే ఆశతో అనవసరమైన కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తారు. అలాంటివి కొందరికి హెల్ప్ అయితే కొందరికసలు కెరీర్ లేకుండా చేస్తాయి. ఇప్పుడు మీరా మిథున్ పరిస్థితి అలానే తయారైంది. ఇప్పటికే కాంట్రవర్సీ యాక్ట్రెస్ అనే స్టాంప్ వేయించుకున్న మీరా తాజాగా సూపర్స్టార్ రజినీకాంత్, ఇళయ దళపతిలపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.
దర్శకుడు చేరన్ చర్యలు తెలిసి కూడా కమల్ ఖండించలేదని విమర్శించింది. ఇక బిగ్బాస్ షో నుంచి వచ్చిన తర్వాత సినీ అవకాశాలు తన ముంగిట వాలతాయని భావించిన మీరా మిథున్కు అక్కడ నిరాశే ఎదురైంది. కట్ చేస్తే.. తనను తమిళ చిత్ర పరిశ్రమ పట్టించుకోవడంలేదని, బాలీవుడ్లో సెటిల్ కానున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చింది. తనకు హిందీ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నట్లు ప్రచారం చేసుకుంది. అయితే అక్కడా ఈ అమ్మడిని పట్టించుకున్న నాథుడే లేడు. దీంతో ఇప్పుడు తమిళ చిత్ర ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతోంది.
తమిళనాట తన ఎదుగుదలను నటుడు రజనీకాంత్, విజయ్ అడ్డుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తూ సోమవారం తన ట్విట్టర్లో పేర్కొంది. అందులో తమిళనాడు తమిళులకు హిందువులకు చెందిందని, అయితే ఇక్కడ మలయాళీలు క్రిస్టియన్ ఆధిపత్యం సాగుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కండక్టర్ రజనీకాంత్, క్రిస్టియన్ విజయ్ తన పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది.
కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి తానేనంటూ ట్విట్టర్లో పేర్కొంది. అదేవిధంగా కన్నగి మదురైని దహించినట్టుగా తాను తమిళనాడును దహించి వేస్తానని పేర్కొంది. ఇలా ఒకదానికి ఒకటి సంబంధంలేని వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందాలని చూస్తున్న నటి మీరా మిథున్పై ఇప్పుడు రజనీకాంత్, విజయ అభిమానులు ఆగ్రహంతో మండి పడుతున్నారు. నువ్వెంత నీ బతుకెంతా.. మా హీరోని అనేంత తోపువా నువ్వు అంటూ.. ట్విట్టర్లో మీరాను ఏకిపారేస్తున్నారు.