Suyodhana: శ్రీరామనవమికి థ్రిల్ చేయనున్న ‘సుయోధన’.. కొత్త కథతో వస్తున్న ప్రియదర్శి

శ్రీరామనవమి సందర్భంగా థియేటర్స్ కి వస్తున్న ప్రియదర్శి 'సుయోధన(Suyodhana)' మూవీ.

Priyadarshi 'Suyodhana' movie releasing on March 27.

Suyodhana: బలగం ఫేమ్ ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన వినూత్న చిత్రం “సుయోధన(Suyodhana)”. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా నేడు(మార్చి 27) శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో బోసుబాబు నిడుమోలు నిర్మించిన ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ నటి ప్రేమ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

Dhurandhar 2: బాక్సాఫీస్ సునామీ.. 7 రోజుల్లోనే రూ.1000 కోట్లు.. చరిత్ర సృష్టించిన ‘ధురంధర్-2’

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకుంటూ, ఇదొక సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాత బోసుబాబు మాట్లాడుతూ, టెక్నీషియన్ల అద్భుతమైన పనితీరు వల్ల సినిమా చాలా క్వాలిటీగా వచ్చిందని, ముఖ్యంగా ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ గైడెన్స్ మర్చిపోలేమని తెలిపారు. దర్శకుడు మాధవ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమాలో ‘సౌండ్’ అనేది ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని, హీరో ప్రియదర్శి ఇందులో ఫోలే ఆర్టిస్ట్‌గా కనిపిస్తారని వెల్లడించారు. సుకుమార్ గారి ‘1 నేనొక్కడినే’ సినిమా స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నానని, సాయికుమార్ గారు సుయోధన పాత్రకు ప్రాణం పోశారని ఆయన పేర్కొన్నారు.

నటుడు సాయికుమార్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, 11 ఏళ్ల వయసులో దుర్యోధనుడి పాత్ర వేశానని, మళ్లీ ఇప్పుడు ఈ సినిమాలో సుయోధనగా నటించడం సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, ఈ కథ విన్నప్పుడే చాలా కొత్తగా అనిపించిందని, హాలీవుడ్ క్లాసిక్ ‘డ్యూన్’ తరహాలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను రూపొందించారని చెప్పారు. బడ్జెట్ విషయంలో వెనకాడకుండా నిర్మాత బోసుబాబు ఈ చిత్రాన్ని నిర్మించారని, ప్రేక్షకులను ఆఖరి వరకు ఉత్కంఠకు గురిచేసే మలుపులు ఇందులో ఉంటాయని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.