లాక్డౌన్ టైం ఎవరికెలా ఉన్నా సెలబ్రిటీలకు మాత్రం బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. షూటింగులతో హడావిడిగా ఉండే నటీనటులంతా అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని నచ్చిన పనులు చేస్తూ ఫిట్నెస్పై మరింత ఫోకస్ చేస్తూ సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా తెలుగు, తమిళ చిత్రాల్లో మెప్పించిన హీరోయిన్ రాశీఖన్నా పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాశీ మంచి సింగర్ కూడా. ఈ ఢిల్లీ భామ కొన్ని తెలుగు చిత్రాల్లో పాటలు కూడా పాడింది. గతేడాది ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో ‘యువర్ మై హై’ అనే పాట పాడి అభిమానులను అలరించింది. ఈ లాక్డౌన్ సమయంలో మ్యూజిక్పై మరింత ఫోకస్ పెట్టిన రాశి, గిటార్ కూడా నేర్చుకుందట.
తాజాగా గిటార్ వాయిస్తూ ‘ఉండిపోరాదే’.. సాంగ్(శాడ్ వెర్షన్)ను పాడి అభిమానులను అలరించింది రాశీఖన్నా. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాశీఖన్నా తెలుగులో సినిమాలేవీ చేయడం లేదు కానీ తమిళంలో మూడు సినిమాలు చేస్తోంది.