తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నట్టు వెల్లడించిన దర్శక ధీరుడు రాజమౌళి..
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్త మీడియా, సోషల్ మీడియాతో పాటు ఫిలిం వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. జక్కన్న ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్లతో ‘రౌద్రం రణం రుధిరం’(RRR) సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తారనే విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా రాజమౌళినే క్లారిటీ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్.నారాయణ నిర్మించనున్నారని కూడా కన్ఫామ్ చేశారు రాజమౌళి.
Read Also : సెలబ్రిటీ పనిమనిషి కూడా సెలబ్రిటీనే!..
పాపులర్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డితో కలిసి పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు నారాయణ. ఇప్పటికే ఈ కథపై తండ్రి విజయేంద్ర ప్రసాద్ వర్క్ చేస్తున్నారని జక్కన్న తెలిపారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్, ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.