శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్స్గా నచించిన ‘రణరంగం’.. నుండి ఎవరో ఎవరో వీడియో సాంగ్ రిలీజ్..
శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్స్గా నచించిన సినిమా.. ‘రణరంగం’.. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదలై, పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ మూవీలో శర్వానంద్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసిన సంగతి తెలిసిందే. 1990 నుంచి 2015 వరకు జరిగే యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన రణరంగంలో శర్వా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
సుధీర్ వర్మ దర్శకత్వంలో, PDV ప్రసాద్ సమర్పణలో.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన రణరంగం మూవీలోని ‘ఎవరో ఎవరో’ అనే వీడియో సాంగ్ రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్. కృష్ణ చైతన్య లిరిక్స్ రాయగా, ప్రీతి పిళ్లై పాడింది. ఈ పాటలో శర్వా, కళ్యాణీల కెమిస్ట్రీ బాగుంటుంది.
Read Also : నిషేధానికి గురైన తొలి తెలుగు చిత్రం – ‘రైతుబిడ్డ’కు 80 ఏళ్ళు..
ప్రశాంత్ పిళ్లై మ్యూజిక్, దివాకర్ మణి విజువల్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. యూత్ ఈ సాంగ్కు బాగా కనెక్ట్ అవుతున్నారు.