కరోనా ఎఫెక్ట్ – ట్రైన్లో క్యాబిన్ క్లీన్ చేసిన బాలీవుడ్ నటి.. వైరల్ అవుతున్న వీడియో..
గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ -19) గురించి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలుపుతూ ‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’తో పాటు, ‘జనతా కర్ఫ్యూ’కి మద్దతుగా వీడియోలు విడుదల చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ ట్రైన్లోని క్యాబిన్ను శానిటైజర్తో క్లీన్ చేశారు. ఆమె ఇటీవల బాంద్రాకు రైల్లో వెళ్తున్న సమయంలో.. ట్రైన్లోని క్యాబిన్ను శానిటైజర్ వేసి శుభ్రం చేశారు.
ముఖానికి ఫేస్ మాస్కు ధరించి సీట్లను క్లీన్ చేస్తున్న వీడియోను ఆమె అభిమానులతో ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ముందు జాగ్రత్తలు పాటిస్తే.. విచారం వ్యక్తం చేయాల్సిన అవసరమండదని తెలుపుతూ.. ‘మేం కూర్చుండే చోటును.. శానిటైజర్ వేసి శుభ్రం చేశా. సౌకర్యంగా అనిపించింది. చాలా అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్త చర్యలు తీసుకోండి. మీకు మీరే అతి ప్రధానం, అది గుర్తుంచుకోండి’ అని అన్నారు. కేంద్రం సూచనల మేరకు వచ్చే వారమంతా పనులను, ప్రయాణాలను తగ్గించుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు.
‘మహమ్మారి కరోనా బారిన పడకుండా.. జాగ్రత్త చర్యల్లో మాస్కులు ధరించండి. వాటిని ముందునుంచి తాకకుండా.. తొలగించండి. వీలైతే చేతులకు గ్లౌవ్స్ కూడా ధరిస్తే మంచిది. ఎందుకంటే డోర్ నాబ్స్, హ్యాండిల్స్కు చాలా బాక్టీరియా ఉంటుంది. మీరు అజాగ్రత్తగా ఉండి ఇతరులకు ఇబ్బంది కలగించొద్దు’ అని మరో పోస్టులో ఆమె పేర్కొన్నారు. సినిమాల విషయానకొస్తే కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘కేజీఎఫ్-2’లో కీలక పాత్రలో నటిస్తోంది రవీనా టాండన్.