ఆర్జీవీ ‘శారీ’ సినిమా నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. ఈ మెలోడీ విన్నారా?

ఆర్జీవీ మలయాళీ భామ ఆరాధ్య దేవితో శారీ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, రెండు పాటలు రిలీజ్ చేయగా తాజాగా మూడో పాటను రిలీజ్ చేసారు. ‘ఎగిరే గువ్వలాగా గాల్లో తేలిపోనా..’ అంటూ మెలోడి గా సాగింది ఈ పాట.