Rishab Shetty: రిషబ్ శెట్టికి రూ.20 కోట్ల భారీ రెమ్యునరేషన్.. ఇది ప్రభాస్, అల్లు అర్జున్ కన్నా చాలా ఎక్కువ!

జై హనుమాన్ సినిమా కోసం షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishab Shetty).

Rishab Shetty Shocking Remuneration for Jai Hanuman movie

  • రిషబ్ శెట్టి షాకింగ్ డెసిషన్
  • రెమ్యూనరేషన్ తగ్గించుకున్న హీరో
  • నిర్మాతల భారం తగ్గించిన రిషబ్ శెట్టి

Rishab Shetty: ప్రస్తుత జనరేషన్ లో పాన్ ఇండియా సినిమాల బడ్జెట్‌లో చాలా భాగం హీరోల రెమ్యూనరేషన్లకే సరిపోతోంది. రూ.300 కోట్ల బడ్జెట్ సినిమాల్లో అగ్ర హీరోలే రూ.150 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నారు. దాంతో, ఆ భారం చివరకు ప్రేక్షకులపై పడుతోంది. రిలీజ్ టైంలో టికెట్ ధరలు పెంచుతున్నారు మేకర్స్. అలా చేయడం వల్ల, సామాన్యులు థియేటర్లకు దూరం అవుతున్నారు.

అయితే, ఈ క్రమంలోనే కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishab Shetty) ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఈ హీరో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి తన పారితోషికం విషయంలో నిర్మాతలకు వెసులుబాటు కల్పించారట.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై క్లారిటీ.. ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ కీలక ప్రకటన!

జై హనుమాన్ కోసం నిర్మాతలు రిషబ్ శెట్టి ముందు రెండు ఆప్షన్లు ఉంచారట. ఒకటి రూ.30 కోట్ల ఫిక్స్‌డ్ రెమ్యూనరేషన్, లేదా రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తోపాటు లాభాల్లో వాటా. వీటిలో, రిషబ్ శెట్టి రెండో ఆప్షన్‌నే ఎంచుకున్నాడట. ఇలా చేయడం వల్ల నిర్మాతల పై భారం తగ్గుతుంది. సినిమా మంచి విజయం సాధిస్తే లాభాల్లో వాటా కూడా వస్తుంది. ఒకవేళ జై హనుమాన్ సినిమా రూ.600 కోట్ల వసూళ్లను సాధిస్తే, వాటాల రూపంలో రిషబ్ శెట్టికి రూ.150 కోట్లకు పైగా దక్కుతుంది.

ఇది ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కంటే చాలా ఎక్కువ. లేదంటే, కేవలం రూ. 20 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. తన సినిమాపై ఉన్న నమ్మకంతోనే రిషబ్ ఈ రిస్క్ తీసుకున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపిస్తుంటే.. దగ్గుబాటి రానా పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హంపీలో మొదలయ్యింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.