Samantha : మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లు ఖర్చుపెడుతున్న సమంత.. నిజమేనా..?

సమంత మయోసైటిస్ చికిత్స కోసం అక్షరాలా 25 కోట్లు ఖర్చుపెడుతుందట. అంతేకాదు ఆ డబ్బుని కూడా ఒక స్టార్ హీరో నుంచి అప్పుగా తీసుకున్నట్లు..

Samantha gave clarity on spending 25crores on her Myositis treatment

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ (Myositis) అనే అరుదైన వ్యాధి భారిన పడి ఇబ్బంది పడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఆ అనారోగ్య సమస్య నుంచి పూర్తిగా కోలుకోవడానికి సమంత ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇది ఇలా ఉంటే, ఇటీవల ఒక వార్త మీడియా వర్గాల్లో బాగా వైరల్ అయ్యింది. అదేంటంటే.. “సమంత మయోసైటిస్ చికిత్స కోసం అక్షరాలా 25 కోట్లు ఖర్చుపెడుతుందని, ఆ డబ్బుని కూడా ఒక స్టార్ హీరో నుంచి అప్పుగా తీసుకుంది” అంటూ పలు మీడియా ఆర్టికల్స్ లో న్యూస్ వచ్చింది.

Chandramukhi 2 : చంద్రముఖిగా కంగనా లుక్ చూశారా.. బయపడాల్సింది పోయి మెస్మరైజ్ అవుతారు..

ఇక ఈ వార్తలని సమంత తనదైన శైలిలో తిప్పుకొట్టింది. తన ఇన్‌స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చింది.. “మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం 25 కోట్లా? మీతో ఎవరో బాడ్ డీల్ కుదుర్చుకున్నారు. నేను అందులో చాలా అంటే చాలా తక్కువే ఖర్చు చేస్తున్నా. నా సంగతి నేను చూసుకోగలను” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అలాగే ఇలాంటి వార్తలు రాసే వారికీ ఒక సలహా కూడా ఇచ్చింది. “మయోసైటిస్ వల్ల బాధపడేవాళ్లు చాలామంది ఉంటారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు రాసే తప్పుడు రాతలను నమ్మి భయంతో ట్రీట్మెంట్ కి వెళ్లకుండా ఆగిపోయేవారు ఉంటారు. కాబట్టి కొంచెం భాద్యతగా వ్యవహరించండి” అంటూ చెప్పుకొచ్చింది.

Naga Chaitanya : తండ్రికి తగ్గ తనయుడు.. అమ్మాయిల మధ్యలో యువ మన్మధుడు..

Samantha gave clarity on spending 25crores on her Myositis treatment

కాగా సమంత ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలిలో ఉంది. అక్కడ ఆమె సహజసిద్ధమైన చికిత్సలను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఉదయం వ్యాయామాలు, యోగాలు, నేచురల్ థెరపీలు తీసుకుంటూ ప్రకృతి మధ్య గడుపుతూ.. మెంటల్ అండ్ ఫిజికల్ గా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా సమంత నటించిన ఖుషి (Kushi) సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

 

ట్రెండింగ్ వార్తలు