Seetha Kalyana Vaibhogame : ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అతిథిగా.. ‘సీతా కళ్యాణ వైభోగమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

Seetha Kalyana Vaibhogame : విలేజ్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నా ఈ సినిమాని సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. తాజాగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.

ఇక ఈ ఈవెంట్ లో జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. “నేను ఎమ్మెల్యేగా గెలుపొందడంలో మా మిత్రుడు యుగంధర్ కూడా ఒక కారణం. అలాంటి నా మిత్రుడు నిర్మించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించి మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. హీరోహీరోయిన్లతో పాటు మూవీ టీం మంచి పేరు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

Also read : Pawan Kalyan: పవన్ కల్యాణ్ నామినేషన్.. ఎన్నికోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

ఇక హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. తమలంటూ కొత్తవారిని ఎంకరేజ్ చేస్తున్న నిర్మాతకు కృతజ్ఞతలు తెలియజేసారు. దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ఆడపిల్ల పుడితే అదృష్టమని చాలామంది అంటుంటారు. కానీ ఆ ఆడపిల్లకు సరైన కేరాఫ్ అడ్రస్ లేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. వారి ఎమోషనల్ జర్నీనే కమర్షియల్ ఫార్మేట్ లో బోర్ కొట్టకుండా సందేశాత్మకంగా చూపించినట్లు పేర్కొన్నారు.

డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. చరణ్ అర్జున్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ అయితే ఆడియన్స్ నుంచి మంచి స్పందనే అందుకుంది.

ట్రెండింగ్ వార్తలు