సినీ కార్మికుల వేతనాలను పెంచే పరిస్థితిలో తాములేమని చిన్న నిర్మాతలు తెలిపారు. తమ వేతనాలు 30 శాతం పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అంత భారాన్ని తాము మోయలేమని చిన్న నిర్మాతలు అంటున్నారు. తమ ప్లేస్లో ఉండి చూస్తే తమ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తాయని అన్నారు.
ఇవాళ నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్, రాజేశ్ దండా, ప్రైమ్షో చైతన్య, శివలంక కృష్ణ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, చాయ్ బిస్కట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, వంశీ నందిపాటి మీడియా సమావేశంలో మాట్లాడారు.
“ఒకేసారి 30% పెంచడం అనేది ప్రొడ్యూసర్లందరికీ ఇబ్బందికర విషయం. ఏరోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలని కూడా అందరూ అడుగుతున్నారు. ఇక్కడ ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీగా ఉన్నారా? లేదా? అని గుండె మీద చేసుకొని చెప్పమంటే ఎవ్వరూ హ్యాపీగా లేరు.
ఒక సినిమా హిందీ డబ్బింగ్ కొనుక్కుంటే సినిమా ఆడలేదని రిలీజ్ తర్వాత రూ.50 లక్షలు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. ఓటీటీ.. రిలీజ్ తర్వాత 50% వన్ మంత్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ, నాలుగు నెలల తర్వాత మాకు డబ్బులు ఇస్తున్నారు. మేము కూడా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాం.
ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇవ్వాలనేది మాత్రం చాలా ఇబ్బందిగా పరిస్థితి. నా సినిమాలో లాస్ట్ ఇయర్ సెట్లో 250 మంది జూనియర్లు ఉన్నారు. అక్కడ కరెక్ట్ గా కార్డు ఉన్నవాళ్లు 50 మంది కూడా లేరు. మిగతా వాళ్లు ఎవరు మరి? యూనియన్ ఏం చేస్తుంది? అంతా మాట్లాడుకుని అందరూ ఒక తాటి మీదకు వచ్చి సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా బతికితేనే థియేటర్లు ఉంటాయి. మీడియా వాళ్లు అందరూ సపోర్ట్ చేసి ఈ సమస్యను తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ప్రొడక్షన్ కాస్ట్ డబుల్ అయిపోయింది..
“సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరుగుతుంది. అది కంట్రోల్ లో లేకుండా అయిపోయింది. మనకి షూటింగ్ కి ఎంతమంది కావాలి? షూటింగ్ ఎక్కడ చేస్తున్నాం? అనే పాయింట్ వదిలేసి ప్రతిరోజు సెట్ లో 100 నుంచి 150 మెంబర్స్ ఉంటున్నారు. ఎందుకు అంటే ఓన్లీ రూల్స్, రెగ్యులేషన్స్ ఇంతమందిని పెట్టుకోవాలి.
ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు అనుకున్న ప్రొడక్షన్ కాస్ట్ కంటే పూర్తయ్యే సరికి ఆ కాస్ట్ డబుల్ అవుతుంది. మీడియా వారికి అందరికీ తెలుసు. బయట ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు, ఆడియన్స్ కి తెలుసు, ప్రొడ్యూసర్స్ తెలుసు, అందరికీ తెలుసు. ప్రొడక్షన్ కాస్ట్ డబుల్ అయిపోయింది. ఈ ఫెడరేషన్ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి.. వాటిని మార్చాలి.. ఇప్పటికైనా నేటి పరిస్థితికి తగ్గట్టు వాటిని మార్చాలి. అవే కండిషన్స్ తో చేయాంటే ఇక్కడ సినిమాలు ఎవ్వరూ ప్రొడ్యూస్ చేయలేరు” అని చెప్పారు.
ఏ నిర్మాత ఏమన్నారు?
రాజేశ్ దండ
మధుర శ్రీధర్
చైతన్య రెడ్డి