Sonam Kapoor : బ్రిటన్ రాజు పట్టాభిషేకానికి బాలీవుడ్ బ్యూటీ అతిథి..

బ్రిటన్ రాజు ఛార్లెస్‌-3 పట్టాభిషేకానికి బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఆహ్వానం అందుకుంది. మే 6 నుంచి 8వ వరకు జరిగే పట్టాభిషేక వేడుకల్లో..

Sonam Kapoor : ఇటీవల కాలంలో ఇండియన్ సినిమా స్టార్స్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంటున్నారు. ఇటీవల ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో దీపికా పడుకోణె, ఆస్కార్ ప్రమోషన్స్ లో పలు ప్రతిష్టాత్మకమైన స్టేజిల పై ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్.. ఇలా మరి కొందరు భారతదేశాని ఇంటర్నేషనల్ లెవెల్ లో రీప్రెజెంట్ చేశారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కూడా అటువంటి గౌరవాన్ని అందుకుంది. అనిల్ కపూర్ (Anil Kapoor) వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది.

Miss Shetty Mr Polishetty : అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటా.. టీజర్ వచ్చేసింది!

2018 లో వివాహం చేసుకున్న ఈ భామ ప్రస్తుతం పెద్దగా సినిమాలో కనిపించడం లేదు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్‌లోనే ఉంటోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ లో యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌తో కనిపించి సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. తాజాగా సోనమ్ కపూర్ బ్రిటన్ రాజు ఛార్లెస్‌-3 (King Charles III) పట్టాభిషేకానికి (Coronation) ఆహ్వానం అందుకుంది. మే 6 నుంచి 8వ తేదీ వరకు పట్టాభిషేక వేడుకలు జరగనున్నాయి. పట్టాభిషేకం అయిన తరువాత రోజు జరిగే కార్యక్రమంలో హాలీవుడ్‌ స్టార్స్ తో పాటు సోనమ్‌ కపూర్‌ కూడా హాజరయ్యి సందడి చేయనుంది.

RGV – Keeravani : ఎవరి మాట వినని వర్మ.. కీరవాణి మాట విని సినిమా క్లైమాక్స్ మార్చేశాడు..

దేశవిదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే ఈ వేడుకకు భారతదేశం నుంచి సోనమ్‌ మాత్రమే ఆహ్వానం అందుకుంది. అంతేకాదు ఈ ఆహ్వానం అందుకున్న మొదటి ఇండియన్ కూడా సోనమ్ కపూర్ కావడం విశేషం. ఇక ఈ ఆహ్వానం గురించి సోనమ్ కపూర్ మాట్లాడుతూ.. “అటువంటి చారిత్రాత్మక కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందడం నాకు దక్కిన గౌరవం. ఛార్లెస్‌ 3 పట్టాభిషేక వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

 

 

ట్రెండింగ్ వార్తలు