రేపు ఉదయం 10:30 తర్వాత బాలు అంత్యక్రియలు..

  • Publish Date - September 25, 2020 / 07:30 PM IST

#SPBalasubrahmanyamLivesOnForever: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.




రేపు (సెప్టెంబర్ 26) ఉదయం 10:30 తర్వాత  తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌ సమీపంలోని తామరైపాకం గ్రామంలో ఎస్పీ బాలు అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఈరోజు సాయంత్రం ఎంజీఎం హాస్పిటల్ నుంచి కోడంబాకంలోని ఎస్పీ చరణ్‌ ఇంటికి అభిమానుల సందర్శనార్థం బాలు పార్థీవదేహాన్ని తరలించారు.