The Kerala Story trailer goes viral adah sharma fires on Criticisms
The Kerala Story : కేరళలో(Kerala) కొంతమంది అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు. దీనిపై బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలు వస్తూ కేరళ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారాయి. ఇటీవల ఇలా అమ్మాయిలు మాయమై టెర్రరిజం వైపు వెళ్తున్న సంఘటనలపై సినిమాని తీశారు. ది కేరళ స్టోరీ(The Kerala Story) అనే టైటిల్ తో కొన్ని రోజుల క్రితం ఓ టీజర్ ని రిలీజ్ చేయగా అది కేరళ వ్యాప్తంగా దుమారం రేపింది. దీనికి కొంతమంది సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు.
ది కేరళ స్టోరీ సినిమాలో అదా శర్మ, సిద్ది ఇదాని, యోగితా.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. సుదీప్తో సేన్ ఈ సినిమాని తెరకెక్కించాడు. తాజాగా ది కేరళ స్టోరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో.. కొంతమంది హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలు చదువు, ఉద్యోగం కోసం కేరళలోని మాములు పల్లెటూళ్ళ నుంచి సిటీకి వస్తారు. అక్కడ కొంతమంది టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించిన మహిళలు వీరిని ఇస్లాం మతంలోకి మారేలా చేస్తారు. కొన్ని సంఘటనలు క్రియేట్ చేసి వారంతట వారే మతం మారేలా చేస్తారు. అనంతరం టెర్రరిస్ట్ గ్రూప్ కి సంబంధించిన అబ్బాయిలు వారిని ప్రేమలో దింపి పెళ్లి చేసుకొని పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్.. ఇలా టెర్రరిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వీరితో టెర్రరిస్ట్ వ్యవహారాలు చేయిస్తారు. అయితే ఇలా జరుగుతున్నట్టు కూడా ఎవ్వరికి తెలీదు. తమ పిల్లలు కనపడకుండా పోయారని పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చి బాధపడతారు.
దీనిపై మరోసారి విమర్శలు వస్తున్నాయి. ది కేరళ స్టోరీ ట్రైలర్ దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ లో దాదాపు ఇప్పటికే 32000 మంది అమ్మాయిలు కేరళలో కనిపించకుండా పోయారని అన్నారు. అక్కడ కేరళలో కూడా ఇలా జరుగుతున్నట్టు అప్పుడప్పుడు వార్తలు వస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. తాజాగా ది కేరళ స్టోరీ విమర్శలపై హీరోయిన్ అదా శర్మ, డైరెక్టర్ సుదీప్తో సేన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
ది కేరళ స్టోరీ ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ లో అదా శర్మ మాట్లాడుతూ.. అసలు అమ్మాయిలు కనిపించకుండా పోవడమే చాలా బాధాకరం. వారంతా ఏమయ్యారో అనే దాని గురించి ఆలోచించకుండా కనపడకుండా పోయింది అంతమంది కాదు అని మేము ట్రైలర్ లో చూపించిన కౌంట్ గురించి మాట్లాడుతున్నారు ఇది చాలా దారుణం. అంటే ఎంతోకొంతమంది కనిపించకుండా పోయారు కదా. నేను కొంతమంది అమ్మాయిలని కలిశాను. వాళ్ళ బాధని మాటల్లో చెప్పలేను. అక్కడి నుంచి బయటపడిన కొంతమంది బాధితుల వివరాలు సేకరించి వాటి ఆధారంగానే సినిమాను తీశాం. మీరు సినిమా చూస్తే అసలు నంబర్ గురించి మాట్లాడారు అని తెలిపింది.
Salman Khan : నా గర్ల్ ఫ్రెండ్స్ అంతా మంచోళ్ళే.. నేనే తప్పు చేశా..
ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్ మాట్లాడుతూ.. ఈ సినిమా తీయడానికి చాలా రీసెర్చ్ చేశాం. దాదాపు ఏడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. RTI చట్టం ద్వారా ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారో సమాచారం అడుగుతుంటే వాళ్ళు మాకు సమాధానం చెప్పట్లేదు, వాళ్ళు సహకరించలేదు, ఇప్పటివరకు కూడా రిపోర్టు ఇవ్వలేదు మాకు. ఈ కథ నా హృదయాన్ని మెలిపెట్టింది. వీటి గురించి మొదట విన్నప్పుడు ఇలాంటివి మన దేశంలో కూడా జరుగుతాయా అనుకున్నాను. కానీ రీసెర్చ్ చేశాక నిజాలు తెలుసుకొని ఆశ్చర్యపోయాను. దీని గురించి అంతా తెలుసుకున్నాకే సినిమా తీశాను అని అన్నారు. ఇక ది కేరళ స్టోరీ సినిమా మే 5న రిలీజ్ కానుంది.