Kadambari Kiran : సినీ నటుడు కాదంబరి కిరణ్ ‘మనం సైతం'(Manam Saitham) ఫౌండేషన్ ద్వారా సినీ పరిశ్రమలోని పేద కార్మికులకు, అలాగే అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. కేవలం తన దగ్గరకి సహాయం అంటూ వచ్చిన వారికి మాత్రమే కాదు.. సినిమా పరిశ్రమలో పని చేసి, ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను వెతుకొని మరి వెళ్లి, వారి కష్టాలను తీరుస్తూ, వారికీ దైవం అవుతున్నారు కాదంబరి కిరణ్.
తాజాగా కిడ్నీ సమస్యతో పోరాడుతున్న సినీ సౌండ్ ఇంజనీర్ ఈమని శ్రీనివాస్కు కాదంబరి కిరణ్ ‘మనం సైతం’ ఫౌండేషన్ ద్వారా సాయాన్ని అందజేశారు. శ్రీనివాస్ రావుకి కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో.. అతని భార్య ఈమని శ్రీదేవి ఒక కిడ్నీని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే ఆ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కావాల్సిన ఖర్చు వారి దగ్గర లేదు. ఆ రూ.25,000 ఖర్చునే కాదంబరి కిరణ్ ఈమని శ్రీనివాస్ కుటుంబానికి అందజేశారు.
Also read : Tillu Square : టిల్లు గాడి కోసం టోనీ.. ఎన్టీఆర్ గెస్ట్గా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్..
ఇక గత వారం సినీ రైటర్ భరత్ కుమార్ కుటుంబానికి కూడా రూ.25,000 సాయం అందించారు. అలాగే సూర్యాపేటకు చెందిన రిపోర్టర్ వై రవి కుమార్ కుటుంబానికి రూ.25,000, సీనియర్ జర్నలిస్ట్ టిఎల్ ప్రసాద్ కంటి ఆపరేషన్ కోసం రూ.25,000 సహాయాన్ని అందించారు. ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తన గొప్ప మనసుని చాటుకుంటున్నారు.