Tollywood Donations : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదల వల్ల విజయవాడ, ఖమ్మం మునిగిపోయి అక్కడి ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది. తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ఇబ్బంది పడిన ప్రజల కోసం సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.
Also Read : Nandamuri Balakrishna : తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ భారీ విరాళం.. ఎంతంటే..?
ఎవరెవరు ఎంతిచ్చారంటే..
#పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.
#జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 50 లక్షల చొప్పున ప్రకటించారు.
#కల్కి నిర్మాతలు వైజయంతి మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షలు ప్రకటించారు.
#మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 50 లక్షల చొప్పున ప్రకటించారు.
#ఆయ్ మూవీ యూనిట్ – ఈ వారం అంతా వచ్చే కలెక్షన్స్ లో 25 శాతం ఏపీ రిలీఫ్ ఫండ్ కు ప్రకటించారు.
#త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ కలిసి రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 25 లక్షల చొప్పున ప్రకటించారు.
#సిద్ధూ జొన్నలగడ్డ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 15 లక్షల చొప్పున ప్రకటించారు.
#విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 5 లక్షల చొప్పున ప్రకటించారు.
#బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల చొప్పున ప్రకటించారు.
#డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి 5 లక్షల చొప్పున ప్రకటించారు.
#అనన్య నాగళ్ళ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి 2.5 లక్షల చొప్పున ప్రకటించింది.
#యాంకర్ స్రవంతి రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి లక్ష రూపాయల చొప్పున ప్రకటించింది.
ఇంకా మరికొంతమంది నటీనటులు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయం కోసం విరాళాలు ప్రకటించనున్నారు.