Tripti Dimri : యానిమల్ సినిమాలో రష్మిక కంటే ఎక్కువగా ఈ హీరోయిన్‌కి పేరొస్తుంది? ఎవరు ఈ హీరోయిన్?

యానిమల్ సినిమాలో రష్మిక మందన్న కంటే ఎక్కువగా తృప్తి దిమ్రీ అనే హీరోయిన్ కి బాగా పేరొస్తుంది. దీంతో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆమె ట్రెండింగ్ లో ఉంది.

Tripti Dimri Goes Viral Bigger Than Rashmika after Animal Movie

Tripti Dimri : సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నాన్న ఎమోషన్స్ తో మాస్ యాక్షన్ జోడించి తెరకెక్కిన సినిమా ‘యానిమల్’. డిసెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజయింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది యానిమల్.

ఈ సినిమాలో ముఖ్యంగా రణబీర్ కపూర్ నటనకి బాగా పేరు వస్తుంది. దాదాపు ఆరు వేరియేషన్స్ తో తన నటనా విధ్వంసం చూపించాడు. సినిమాలో రష్మికకు కూడా మంచి పేరు వస్తుంది. రొమాన్స్ సన్నివేశాలతో పాటు సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ని పండించింది. అయితే యానిమల్ సినిమాలో రష్మికకు కంటే ఎక్కువగా తృప్తి దిమ్రీ అనే హీరోయిన్ కి బాగా పేరొస్తుంది. దీంతో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో త్రిప్తి దిమ్రి ట్రెండింగ్ లో ఉంది.

సెకండ్ హాఫ్ లో రణబీర్ దగ్గరకి ఎమోషన్ తో వచ్చి తృప్తి దిమ్రీ రణబీర్ మనసుని కరిగిస్తుంది. రణబీర్ తృప్తి దిమ్రీ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఆమెతో ఫిజికల్ గా కూడా కనెక్ట్ అవుతాడు. భార్య రష్మిక ఉండగానే తృప్తి దిమ్రీతో తిరుగుతుంటాడు. వీళ్లిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్, రొమాన్స్ సీన్స్ బాగున్నా మరీ ఎక్కువ సేపు ఉండటంతో సాగదీసినట్టు అనిపిస్తుంది. తృప్తి దిమ్రీ ఎమోషన్, రొమాన్స్ సన్నివేశాల్లో మెప్పిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే రష్మిక కంటే బాగుందని, బాగా చేసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : బాలీవుడ్‌ని షేక్ చేసిన సందీప్ వంగా.. ఖాన్‌లని దాటిన కపూర్.. యానిమల్ మొదటి రోజు కలెక్షన్స్..

దీంతో సినిమా చూడని వాళ్ళు కూడా తృప్తి దిమ్రీ ఎవరా అని వెతికేస్తుండటంతో ఇవాళ అంతా గూగుల్ లో ట్రెండింగ్ లో ఉంది. తృప్తి దిమ్రీ ఉత్తరాఖండ్ కి చెందిన అమ్మాయి. 2017లో శ్రీదేవి మామ్ అనే సినిమాలో ఓ ముఖ్య పాత్రతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పోస్టర్ బాయ్స్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన తృప్తి దిమ్రీ..  నాగిని సీరియల్ లో ఓ గెస్ట్ రోల్ కూడా చేసింది. ఇప్పుడు యానిమల్ సినిమాలో జోయా పాత్రలో ప్రేక్షకులని మెప్పిస్తోంది.

ఈ సినిమా తర్వాత తృప్తి దిమ్రీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా ఆమె గురించి తెగ వెతికేస్తున్నారు. ట్విట్టర్ లో ఆమె గురించి పోస్ట్ చేస్తుండటంతో తృప్తి దిమ్రీ ట్రెండింగ్ లో ఉంది. ఇక రష్మిక మెయిన్ హీరోయిన్ అయినా తృప్తి దిమ్రీకి ఇంత పేరు రావడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు