అక్రమంగా తరలిస్తున్న 13కిలోల బంగారం పట్టివేత
- Subhan Ali Shaik
- Published On : October 10, 2019 / 02:57 PM IST
అక్రమంగా తరలిస్తున్న 13కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జ్ఞానేశ్వరీ సూపర్ డీలక్స్ రైల్లో అనుమానంగా కనిపిస్తున్న ఇద్దరి వ్యక్తులను చెక్ చేశారు. వారి వద్ద 4.99కోట్ల రూపాయల విలువైన బంగారం దొరికింది.
డీఆర్ఐ అధికారులు చేసిన సోదాల్లో 12.932కేజీల బంగారం బిస్కెట్ల రూపంలో తరలిస్తున్నట్లు తేలింది. సరైన అనుమతుల్లేకుండా అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
