India : విద్యకు దూరమైన 15 కోట్ల మంది..25 కోట్ల మందికి అక్షరజ్ఞానం కూడా లేదు

దేశంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటానికి 2009లో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చుకున్నాం. ఈ విద్యాహక్కు చట్టం ప్రకారం..6 నుంచి 14యేళ్ళ లోపు చిన్నారులకు విద్య ప్రాథమిక హక్కు. కానీ చట్టాలను చేసే నాయకులే చట్టాలని అమలు చేయటంలేదు. దీంతో భారత్ లో విద్యకు దూరమవుతున్న బాలలు కోట్ల సంఖ్యకు చేరుకున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్రమే వెల్లడించింది. విద్యకు దూరమైన పిల్లలు దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

India Education

15 crore childrens not part of education system : దేశంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటానికి 2009లో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చుకున్నాం. ఈ విద్యాహక్కు చట్టం ప్రకారం..6 నుంచి 14యేళ్ళ లోపు చిన్నారులకు విద్య ప్రాథమిక హక్కు. కానీ చట్టాలను చేసే నాయకులే చట్టాలని అమలు చేయటంలేదు. దీంతో భారత్ లో విద్యకు దూరమవుతున్న బాలలు కోట్ల సంఖ్యకు చేరుకున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్రమే వెల్లడించింది. విద్యకు దూరమైన పిల్లలు దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) గురువారం (ఆగస్టు 12,8.2021)‘‘ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు’’ అనే అంశంపై నిర్వహించిన వార్షిక సదస్సులో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతు.. విద్యావ్యవస్థకు దూరంగా దేశవ్యాప్తంగా 15కోట్లమంది పిల్లలు ఉన్నారనీ..మరో 25 కోట్ల మందికి అక్షరజ్ఞానం కూడా లేదని వెల్లడించారు. 3 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న వారి గణాంకాలను పరిశీలిస్తే ప్రభుత్వం, ప్రైవేటు, చారిటబుల్‌ సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఉన్నత విద్యా సంస్థల్లో దాదాపుగా 35 కోట్ల మంది చదువుకుంటున్నారని వెల్లడించారు.

3 నుంచి 22 ఏళ్ల వయస్సు వారు దేశ జనాభాలో 50 కోట్లు మంది ఉన్నారని..దీనిని బట్టి చూడగా..15 కోట్ల మంది పిల్లలు విద్యకు దూరంగా ఉన్నారని తెలిపారు. అలా చదువుకు దూరంగా ఉన్నవారిని బడిబాట పట్టించటానికి కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. అందరికీ విద్య అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ సమయంలో అక్షరాస్యత 80 శాతానికి చేరుకుందని మంత్రి తెలిపారు. అయినాగానీ దేశంలో దాదాపుగా 25 కోట్ల మంది ఈనాటికీ నిరక్షరాస్యులుగా ఉన్నారని తెలిపారు.

కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) మరో 25 సంవత్సరాలకి సాధించాల్సిన లక్ష్యాలకు సంబంధించి రోడ్‌ మ్యాప్‌ అన్నారు. దేశ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల సమయానికి ఏం సాధించాలో మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు. కరోనా సంక్షోభం సమయంలో డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం పెరిగిందని..దీని ద్వారా తద్వారా విద్యారంగంలో సృజనాత్మకత, పెట్టుబడులకు అవకాశం పెరుగుతుందని అన్నారు. భవిష్యత్‌లో పల్లె పల్లెకి హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్లు వస్తాయని, దీనివల్ల విద్యా వ్యవస్థలో డిజిటలైజేషన్‌ పెరిగి వినూత్న మార్పులు వస్తాయని చెప్పారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన జనాభా లెక్కల ప్రకారం అప్పటికి జనాభాలో 19% మంది అక్షరాస్యులుగా ఉన్నారని తెలిపారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవం తరువాత..అక్షరాస్యుల సంఖ్యపెరిగిందని అది 80%కి చేరుకుందని తెలిపారు. అంటే 20% జనాభా లేదా సుమారు 25 కోట్ల మంది ఇప్పటికీ అక్షరాస్యత యొక్క ప్రాథమిక నిర్వచనం కంటే తక్కువగా ఉన్నారు, ”అని ఆయన పేర్కొన్నారు.