Sheikh Hasina: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా.. ఇరు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలపై తీవ్ర చర్చలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఒకే రోజులో నలుగురైదుగురు భారత ప్రముఖుల్ని కలుస్తూ వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ లబ్ది పొందేలా ముందుకు సాగుతున్నారు. కాగా, ఇంత బీజీ షెడ్యూలులో ఆమె ఉన్నట్టుండి కళాకారులతో కలిసి డాన్స్ వేస్తూ కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది.
రాజస్తాన్ పర్యటన సందర్భంగా రాజధాని గురువారం జైపూర్ వచ్చారు. ప్రత్యేక విమానంలో జైపూర్ చేరుకున్న ఆమెకు రాజస్తానీ కళాకారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పాటలు పాడుతూ డాన్స్ చేస్తున్న వారిని చూసి హసీనా.. తనకు తానుగానే ముందుకు వచ్చి వారితో కలిసి సరదాగా డాన్స్ చేశారు. వారితో ప్రత్యేకంగా ఫొటోలు తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | Rajasthan: Upon her arrival at Jaipur airport earlier today, Bangladesh PM Sheikh Hasina grooved with the local artists who had gathered there to welcome her. pic.twitter.com/Mk8qf5xDEG
— ANI (@ANI) September 8, 2022