ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 ఎన్నికల వేళ బీజేపీ తమ మ్యానిఫెస్టోలో సీఏఏను చేర్చింది. పొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ వెసులుబాటు ఇస్తుంది.
పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు సీఏఏ వరంగా మారనుంది. 2019 డిసెంబర్ 11న పార్లమెంట్ లో సీఏఏ ఆమోదం పొందింది. మొదటిసారి మత ప్రాతిపదికన పౌరసత్వ కల్పన జరుగుతుంది. 2019లో సీఏఏకు సంబంధించి హింసాత్మక ఘటనల్లో 100 మందికి పైగా మృతి చెందారు. లోక్ సభకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం కీలక అడుగు వేసిందని చెప్పుకోవాలి. నాలుగేళ్లుగా సీఏఏ అమలు వాయిదా పడుతూ వస్తోంది.
ఎప్పుడు ఏం జరిగింది? ఏం జరగనుంది?
Bjp Second List : లోక్సభ ఎన్నికలు.. బీజేపీ సెకండ్ లిస్ట్ రెడీ..!