Class 12 Exams ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
పరీక్షల కంటే విద్యార్థుల జీవితాలు చాలా ముఖ్యమైనవని సీఎంవో కార్యాలయం ఓ ట్వీట్ లో తెలిపింది. కరోనా నేపథ్యంలో ఒడిషా CHSE బోర్డు 12వ తరగతి పరీక్షలు రద్దు అయినట్లు తెలిపింది. ఈ మేరకు పరీక్షలు రద్దు చేయాలని ఒడిశా కౌన్సిల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ను ఆదేశించినట్లు సీఎం కార్యాలయం ఆ ట్వీట్ లో తెలిపింది. దీనికి సంబంధించి అధికారిక నోటీస్ ని CHSE త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
కాగా,కొద్ది రోజుల క్రితం 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఒడిషా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బుధవారం కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో..తాము కూడా పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఒడిషా ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది.