కార్తీ చిదంబరంకు చోటు :10మందితో కాంగ్రెస్ మరో జాబితా విడుదల

లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల మరో జాబితాను ఆదివారం(మార్చి-24,2019) కాంగ్రెస్ విడుదల చేసింది. బీహార్ లోని మూడు,మహారాష్ట్రలోని నాలుగు,కర్ణాటకలోని ఒకటి,జమ్మూకాశ్మీర్ లో ఒకటి,తమిళనాడులో ఒక లోక్ సభ స్థానానికి పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. పది మంది అభ్యర్ధులతో కూడిన జాబితాలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి స్థానం దక్కింది. తమిళనాడులోని శివగంగ నియోజవర్గం నుంచి కార్తీ బరిలోకి దిగుతున్నారు

.

ట్రెండింగ్ వార్తలు