BiparJoy Cyclone
Gujarat Kutch Coast : బిపోర్ జాయ్ తుఫాను గుజరాత్ కచ్ తీరం వైపు దూసుకొస్తోంది. గురువారం సాయంత్రం జకౌ తీరం దాటనుంది. తుఫాను తీరం దాటే సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
కచ్, ద్వారాక ప్రాంతాల నుంచి 12,000 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ రైల్వే గుజరాత్ తీర ప్రాంతంలో 56 రైళ్లను రద్దు చేసింది. మొత్తం స్కూల్స్ మూతపడ్డాయి. పోర్టుల నుంచి లారీలు ఖాళీ అయ్యాయి.
చేపల వేట నిలిచిపోయింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. భారత పశ్చిమ తీరం, పాకిస్తాన్ పై తుఫాను ప్రభావం భారీగా ఉండనుంది.