తిరువారూర్ : తమిళనాడు తిరువారూర్ జిల్లా మాన్నార్ గుడిలో బాణసంచా కర్మాగారంలో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మణం పాలవ్వగా.. మరోఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను మన్నార్ గుడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. పాతబడిన భవనం కావడంతో ఈ పేలుడు ధాటికి మొత్తం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సింగారవేలు, సురేష్, బాబు, మోహన్, వీరయ్యన్ అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మృతి చెందిన సింగారువేలు ఎటువంటి అనుమతులు లేకు బాణసంచా కర్మాగారాన్ని ఏర్పాటు చేసి మందుగుండు సామాగ్రి తయారుచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బాణాసంచా తయారీ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున బాణసంచా తయారీ సామాగ్రి ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువైనట్టు పోలీసులు తెలిపారు.
Read Also : వివేకా హత్య కేసు : ఎంపీగా గెలిచేందుకే చంపేశారు