Madhya Pradesh: ఇదేం రూలు? ఆవులను వీధుల్లో వదిలేస్తే చెప్పుదెబ్బలు విధిస్తారట
పశువులు, ఆవులను యథేచ్ఛగా వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు విధిస్తారట. దీనితో పాటుగా 500 రూపాయట జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని గ్రామంలో చాటింపు వేయించి మరీ తెలియజేశారు.
- tony bekkal
- Published On : July 21, 2023 / 07:50 PM IST
Slaps with Slipper: దేశ చట్టాలు, ప్రభుత్వ పనితీరు ఒక రకంగా ఉంటే.. గ్రామ స్థాయిల్లో పాలన మరొక రకంగా ఉంటుంది. ముఖ్యంగా అప్పుడప్పుడు పంచాయతీ పెద్దలు అమలు చేసే శిక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి. పోలీస్ స్టేషన్, కోర్టు అని తిరక్కుండా.. చట్టంతో సంబంధం లేకుండా అక్కడికక్కడే వారికి తోచిన రీతిలో తీర్పులు ఇస్తుంటారు, ఆదేశాలు జారీ చేస్తుంటారు, నిబంధనలు పెడుతుంటారు. ఏదైనా నేరం చేసినవారికి కొరడా దెబ్బలు, గ్రామ బహిష్కారాలు వంటి శిక్షలను విధిస్తూ ఉంటారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నాగనడుయి గ్రామంలో ఇలాంటి ఒక వింత ఆదేశాలు జారీ చేశారు ఆ గ్రామ సర్పంచ్. అదేంటంటే.. పశువులు, ఆవులను యథేచ్ఛగా వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు విధిస్తారట. దీనితో పాటుగా 500 రూపాయట జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని గ్రామంలో చాటింపు వేయించి మరీ తెలియజేశారు.
मप्र. शहडोल अंतर्गत ग्राम नगनौड़ी में पंचायत की तरफ से अजब-गजब फ़रमा सुनकर लोगों की हंसी नहीं थम रही।
“मवेशी खुले में घूमते मिले तो 5 पनही (5 जूते मारकर) ₹500 का जुर्माना भी लिया जाएगा।#Shahdol #viralvideo #rural_Communication pic.twitter.com/h38qpk3jnQ
— Ravi tripathi (@RaviTripathi25) July 21, 2023
సర్పంచ్ ఆదేశాలను ఉద్యోగులు ప్రజలకు తెలియజేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉద్యోగులు డప్పు కొడుతూ, బిగ్గరగా అరుస్తూ ఈ శిక్ష గురించి చెప్తుండటం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే గ్రామస్థులు ఈ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిబంధనను వెంటనే ఉపసంహరించాలని కోరారు. స్థానిక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వీరికి మద్దతుగా నిలిచారు.
