Electric Buses: ఢిల్లీ వాసులకు మరో 3రోజుల వరకూ 150 బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలకు మేరకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరిలో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ మినిష్టర్ గెహ్లాట్.. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ త్వరలో 1500 ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు లాంచ్ చేస్తున్న తొలి రాష్ట్రంగా ఢిల్లీని అభివర్ణించారు.
గెహ్లాట్ ట్వీట్ చేస్తూ, “గౌరవనీయులైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ దృష్టిలో, 100% బస్సుల విద్యుదీకరణను సాధించడానికి కట్టుబడి ఉందని చెప్పింది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ త్వరలో TheGrandChallengeలో భాగంగా 1500 ఈ-బస్సులను లాంచ్ చేస్తుంది.. ఇంత స్థాయిలో ఈ-బస్సులను దత్తత తీసుకున్న తొలి రాష్ట్రం ఢిల్లీనే”
CM కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం EVలకు మారడానికి ప్రయాణికులను ప్రోత్సహిస్తుంది. నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రచారం, వాటిని అలవరచుకోవడం కోసం ప్రత్యేక వన్-స్టాప్ వెబ్సైట్ను కూడా ప్రారంభించింది.
Read Also: టాటా నుంచి ఎలక్ట్రిక్ కార్గో వెహికల్.. ఫుల్ డిమాండ్
వెబ్సైట్ ఛార్జింగ్ స్టేషన్ల స్థానం, అవసరమైన ఛార్జర్ రకం, ఛార్జింగ్ పాయింట్ల వంటి సమాచారాన్ని అందిస్తుంది.